మునగాల వద్ద బస్సు బోల్తా

19 Sep, 2018 07:22 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట : జిల్లాలోని మునగాల వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టి.. రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఈ బస్సు శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 30 మందికి తీవ్ర గాయాలయినట్టు సమాచారం. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. బస్సు పల్టీ కొట్టడంతో అందులో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అతి వేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు