తలమడుగు(బోథ్): సుంకిడి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని జైముత్తాకుల జ్యోతి (15) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆదివారం ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జ్యోతి గత కొద్ది నెలల నుంచి కడుపు నొప్పితో బాధపడుతోంది. ఆదివారం తల్లి పద్మ చర్చికి వెళ్లి వచ్చే సరికి జ్యోతి ఇంట్లో దూలానికి ఊరేసుకుని మృతి చెంది ఉండడంతో ఒకేసారి కేకలు వేసింది. దీంతో చుట్టు పక్కల వారు వచ్చి చేసే సరికి అప్పటికే మృతి చెందింది. తండ్రి సుంకన్న గతంలోనే మృతి చెందగా, తమ్ముడు మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో తల్లి పద్మ రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.