హోటల్‌ గదిలో యువకుడు ఆత్మహత్య

21 Jan, 2018 20:15 IST|Sakshi

సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మోతుకూరి సాయి వెంకట వంశీ కృష్ణ అనే యువకుడు స్థానిక సీఆర్‌ రెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలో సీఎస్‌ఈ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇక్కడి ఓ హోటల్ గదిలో ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. త్రీ టౌన్ పోలీసులు హోటల్‌కు చేరుకుని మృతుడి వివరాలు సేకరిస్తున్నారు. మృతుడిని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందినవాడిగా గుర్తించారు. 

మరిన్ని వార్తలు