విద్యార్థినితో సన్నిహితంగా ఉంటున్నాడని..

17 Feb, 2019 18:53 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: విద్యార్థినితో సన్నిహితంగా ఉంటున్నాడన్న కోపంతో ఎన్‌సీసీ మాస్టర్‌పై విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం నెల్లూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీహరి అనే నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఎన్‌సీసీ మాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే శ్రీహరి ఓ విద్యార్థినితో సన్నిహితంగా ఉంటున్నాడని ఆరోపిస్తూ శ్రీకాంత్‌ అనే విద్యార్థి సహచర విద్యార్థులతో కలిసి అతడిని చితకబాదాడు. దీంతో శ్రీహరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.  

మరిన్ని వార్తలు