మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం

4 Sep, 2019 12:07 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: జిల్లాలో ర్యాగింగ్‌ కలకలం సంచలనంగా మారింది. నిజామాబాద్‌ మెడికల్‌ కళాశాల విద్యార్థిని తనను కొంతమంది ర్యాంగింగ్‌ చేస్తున్నారంటూ తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది.  బాధితురాలి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా హాస్టల్‌లో విద్యార్థులు మద్యం తాగుతున్నట్లుగా గుర్తించారు. కాలేజీ యాజమాన్యం ర్యాంగింగ్‌కు పాల్పడిన ముగ్గురు వైద్య విద్యార్థులను హాస్టల్‌ నుంచి తొలగించింది. పోలీసుల హెచ్చరికలతో డీఎంఈ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

మరిన్ని వార్తలు