రివాల్వర్‌తో కాల్చుకుని కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

3 May, 2019 21:21 IST|Sakshi

కామారెడ్డి జిల్లా: కామారెడ్డిలో శ్రీనివాస్‌ గౌడ్‌ అనే కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని తనువు చాలించాలని ప్రయత్నించాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలిసి జిల్లా ఎస్పీ శ్వేతా రెడ్డి ఆసుపత్రికి చేరుకుని ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.  పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌కు శ్రీనివాస్‌ను తరలించారు. శ్రీనివాస్‌ గౌడ్‌ కామారెడ్డిలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీనివాస్‌ గౌడ్‌ సొంత జిల్లా వరంగల్‌.
 

మరిన్ని వార్తలు