యువకుడి ఆత్మహత్య

4 Oct, 2017 01:33 IST|Sakshi

టీ.నగర్‌: తిరువొత్తియూరులో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరువొత్తియూరు సమీపాన గల పళవేతొట్టికుప్పం ప్రాంతానికి చెందిన నరేష్‌ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతనికి పక్కింటి యువకుడు నవీన్‌(18)తో తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో సోమవారం వారి మధ్య మళ్లీ తగాదా ఏర్పడింది.

ఆ సమయంలో నవీన్‌ అతని స్నేహితులు కలిసి నరేష్‌పై దాడికి ప్రయత్నించినట్టు తెలిసింది. దీన్ని అవమానంగా భావించిన నరేష్‌ తన ఇంటి సమీపాన ఉన్న మర్రిచెట్టుకు సోమవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

మరిన్ని వార్తలు