సాక్షి, చెన్నై : తమిళనాడులోని తిరుపూర్లో దారుణం జరిగింది. రమేశ్ అనే జ్యోతిష్యుడిని గుర్తు తెలియని వ్యక్తి నడిరోడ్డుపై నరికి చంపాడు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలు... కుమరన్ రోడ్డులో కూర్చుని జ్యోతిష్యం చెప్పే రమేశ్పై.. సమీపంలో ఉన్న పార్కుకు వచ్చే మహిళలు, ప్రేమికులను లక్ష్యంగా చేసుకుని వారిని వ్యభిచార కూపంలోకి దింపుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2016లో తన ప్రియురాలిని కూడా ఇదే విధంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేలా ప్రోత్సహించాడనే అనుమానంతోనే హంతకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.