నానా పటేకర్‌పై తనూశ్రీ దత్తా ఫిర్యాదు

7 Oct, 2018 04:10 IST|Sakshi
తనూశ్రీ దత్తా

ముంబై: బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌ తనను వేధించారంటూ నటి తనూశ్రీ దత్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నటి తనూశ్రీ శనివారం నానా పటేకర్‌పై మాకు ఫిర్యాదు అందజేశారు. ఈ కేసులో ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు’ అని ముంబై (పశ్చిమ) ఏసీపీ మనోజ్‌ తెలిపారు. జోథ్‌పూర్‌లో జరుగుతున్న హౌస్‌ఫుల్‌–4 సినిమా షూటింగ్‌ నుంచి ఇక్కడికి చేరుకున్న పటేకర్‌ ఈ విషయమై స్పందిస్తూ..‘ఆమె ఆరోపణ అబద్ధమని పదేళ్ల క్రితమే చెప్పా’ అని అన్నారు. క్షమాపణ చెప్పాలంటూ తనూశ్రీకి ఇప్పటికే ఆయన లీగల్‌ నోటీసు పంపారు. 2008లో ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో నానాపటేకర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ తనూశ్రీ ఆరోపించింది.

మరిన్ని వార్తలు