మైనార్టీలపై టీడీపీ దాడి

14 Jan, 2018 16:09 IST|Sakshi

జానపాడులో ఉద్రిక్తత

సాక్షి, పిడుగురాళ్ల: గుంటూరుజిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడులో ఉద్రిక్తత నెలకొంది. మైనార్టీలపై టీడీపీ నాయకులు దాడులు చేయడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ముస్తఫా, పార్టీ నేతలు అంటి రాంబాబు, ఎల్‌.అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్‌, జంగా కృష్ణమూర్తి, కావటి మనోహర్‌లు పరామర్శించారు. పోలీసులు టీడీపీ నాయకులకే వత్తాసు పలుకుతున్నారని వారు ఆరోపించారు.

మరిన్ని వార్తలు