నాటుసారా తరలిస్తున్న టీడీపీ నేత అరెస్ట్‌

14 Aug, 2019 13:58 IST|Sakshi

సాక్షి, కాకినాడ : సముద్రం మీదుగా బోటులో నాటుసారా తరలిస్తుండగా నేమాంకు చెందిన టీడీపీ నేత మేడిశెట్టి బుజ్జి ఎక్సైజ్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో బుజ్జి నుంచి పెద్ద ఎత్తున సారాయి, బోటు, ఆటోను స్వాధీనం పరుచుకున్నట్లు ఎక్సైజ్‌ సిబ్బంది వెల్లడించింది. కాకినాడకి చెందిన ఓ టీడీపీ నేత అండదండలతో బుజ్జి నాటుసారా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గత మార్చిలోనూ ఇదే విధంగా నాటుసారా తరలిస్తుండగా కాకినాడ రూరల్‌ పోలీసులకు చిక్కినట్లు అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు