సీఎం సభకు వెళ్తూ ఒకరు మృతి

27 Mar, 2019 18:58 IST|Sakshi
ప్రమాద స్థలంలో బోల్తా పడలిన ఆటో

సాక్షి, అనంతపురం: సీఎం చంద్రబాబు ఎన్నికల సభకు జనాలను తరలించే తరుణంలో ఆటో బోల్తా పడి ఒకరు మృతి. ఈ ఘటన బుధవారం సాయంత్రం అనంతపురం జిల్లా మబకశిర మండలం ఎగువ అచ్చంపల్లి దగ్గర జరిగింది.

ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, మరో 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.  ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు