లాటరీ టికెట్ల దందా : టీడీపీ నాయకుడు అరెస్ట్‌

5 Jun, 2020 12:44 IST|Sakshi
లాటరీ టికెట్ల కేసులో అరెస్టయిన నిందితులు చంద్రశేఖర్, రియాజ్, రషీద్‌

మరో ఇద్దరిపై కేసు నమోదు

చిత్తూరు, పుంగనూరు: పట్టణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు చంద్రశేఖర్‌  చట్టవిరుద్ధంగా లాటరీ టికెట్ల వ్యాపారంలో అరెస్ట్‌ అయ్యాడు. గురువారం సీఐ గంగిరెడ్డి విలేకరులకు తెలిపిన మేరకు.. పట్టణంలోని ఓ మాజీ కౌన్సిలర్‌ భర్త చంద్రశేఖర్‌ తన అనుచరులైన రియాజ్‌బాషా, రషీద్‌బాషాతో కలసి లాటరీ టికెట్లు విక్రయిస్తుండగా ఈనెల 2వ తేదీన కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. దీనిపై దర్యాప్తు చేసి ఉదయం 9 గంటలకు బస్టాండులో ఉండగా చంద్రశేఖర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి 12 లాటరీ టికెట్లను, రూ.4,790 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండుకు తరలించారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించేవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు