టీచర్‌ కొట్టాడని విద్యార్థి ఆత్మహత్య

8 Jan, 2018 15:20 IST|Sakshi

ఖమ్మం: నగరంలోని ఓ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. టీచర్‌ మందలించాడని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని గోపాలపురం వద్ద ఉన్న శ్రీ విద్య నికేతన్ పాఠశాలలో ప్రశాంత్‌ (14) అనే బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. అతడిని ఉపాధ్యాయుడు కొట్టడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఉరిపెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు