ఖమ్మం: నగరంలోని ఓ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. టీచర్ మందలించాడని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని గోపాలపురం వద్ద ఉన్న శ్రీ విద్య నికేతన్ పాఠశాలలో ప్రశాంత్ (14) అనే బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. అతడిని ఉపాధ్యాయుడు కొట్టడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఉరిపెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.