రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

22 Dec, 2018 12:11 IST|Sakshi
మృతదేహం వద్ద రోదిస్తున్న శైలజాకుమారి కుటుంబ సభ్యులు

కర్నూలు, కర్నూలు(అర్బన్‌): కర్నూలు రూరల్‌ పరిధిలోని పంచలింగాల వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అలంపూర్‌లో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న ఎస్‌. శైలజాకుమారి మృతి చెందారు. పంచలింగాల బస్సు స్టేజీ వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుకనుంచి వస్తున్న లారీ ఢీ కొనడంతో ట్రాక్టర్‌ ట్రాలీ ఎగిరి పక్కనే నిలబడి ఉన్న ఎస్‌. శైలజకుమారిపై పడింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం   స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా కోలుకోలేక మృతి చెందారు. శైలజాకుమారి అలంపూర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. కర్నూలులోని సంతోష్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కర్నూలు రూరల్‌ సీఐ బీవీ రమణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు