అనంతపురం జిల్లా : హిందూపురం పట్టణంలో శనివారం కిడ్నాప్ కలకలం రేగింది. పరిగి మండలం కాలువపల్లి ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కిష్టప్పను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. తనను ఎవరో కిడ్నాప్ చేశారంటూ తోటి ఉపాధ్యాయుడికి కిష్టప్ప ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఈ విషయం ఆ ఉపాధ్యాయుడు, కిష్టప్ప భార్యకు తెలియజేయడంతో ఆమెను పోలీసులను ఆశ్రయించింది. స్థానిక పోలీస్స్టేషన్లో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.