చనువుగా ఉంటూ నగ్నఫొటోలు తీసి వంచన

14 Jul, 2018 08:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముగ్గురు యువకులకు కటకటాలు

దొడ్డబళ్లాపురం: యువతులతో పరిచయం పెంచుకుని చనువుగా ఉంటూ వారి నగ్న ఫోటోలు తీసి ఇంటర్నెట్‌లో పెడుతున్న  ముగ్గురు యువకులకు బేడీలు పడ్డాయి.సందేశ్,జగదీష్,నవీన్‌ అనే నిందితులను  దక్షిణ కన్నడ జిల్లా ఉప్పి నంగడి పోలీసులు అరెస్టు చేశారు.  సందేశ్‌ మొదట యువతులను ఆకర్షించి పరిచయం పెంచుకుని చనువుగా ఉం టూ నగ్న ఫోటోలు తీసేవాడు. యువతులను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ పబ్బం గడుపుకునేవా రు.  యువతులు ఎదురుతిరిగితే వారి ఫోటోలను  ఇంటర్నెట్‌లో పెట్టేవారు. ఒక యువతి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదుచేయడంతో నిందితుల బండారం బయటపడింది.  

మరిన్ని వార్తలు