సెల్ఫీ కోసం బాలిక స్టీల్‌ప్లాంటుకు వెళ్లగా..

14 Nov, 2017 09:52 IST|Sakshi

సాక్షి, బొకారో :  జార్ఖండ్‌లో ఓ సెల్ఫీ విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకునే యత్నంలో ఓ మైనర్‌ బాలిక ప్రాణాలు పోగొట్టుకుంది. పోలీసుల కథనం ప్రకారం..  సులేఖా కుమారి అనే 16 ఏళ్ల బాలిక స్థానిక బడా ఖట్మల్ కశ్మీరీ కాలనీలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం బొకారో స్టీల్ ప్లాంట్ వద్దకు సులేఖా వెళ్లింది. ప్లాంట్ వద్ద కూలింగ్ పాండ్ (కొలను) పైన నిల్చుని సెల్ఫీ తీసుకోవాలని భావించింది. తన స్మార్ట్‌ఫోన్లో సెల్ఫీ తీసుకునే యత్నంలో కాలుజారి ఆ కొలనులో పడిపోయి మృతిచెందింది. ఆమె మృతదేహం కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. బాలిక మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు