మేనమామకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకున్న యువకుడు
తాండూరులో రైలు కిందపడి బలవన్మరణం
సాక్షి, తాండూరు: రైలు కింద పడి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం తాండూరు రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తాండూరు రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యాలాల మండలం జుంటుపల్లి గ్రామానికి చెందిన గంబీరపు నర్సిములు కుమారుడు నవీన్కుమార్ (19) ఇంటర్ పూర్తి చేసి వడ్రంగి పని నేర్చుకుంటున్నాడు. బుధవారం ఉదయం వికారాబాద్ వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన నవీన్కుమార్ తన మేనమామకు ఫోన్ చేసి ‘నేను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని చెప్పి ఫోన్ స్విచాఫ్ చేశాడు. దీంతో కంగారుపడిన కుటుంబసభ్యులు హుటాహుటిన తాండూరు రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకున్నారు. అప్పటికే నవీన్కుమార్ కాకినాడ– లింగంపలిŠల్ రైలుకు ఎదురుగా వెళ్లాడు. దీంతో రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. నవీన్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఆత్మహత్య పాల్పడానికి కారణాలు తెలిసి రావడంలేదు. యువకుడి మృతితో గ్రామంలో పండుగ పూట విషాదం నెలకొంది. తాండూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.