సనత్నగర్: బేగంపేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని రసూల్పురాలో దారుణం జరిగింది. ఓ అవివాహిత గర్భవిచ్ఛిత్తి కోసం ఓ ప్రైవేటు హోమియో క్లినిక్ వైద్యుడిని సంప్రదించింది. సదరు వైద్యుడు ఇచ్చిన మందులు వేసుకున్న యువతి కడుపునొప్పి రావడంతో పక్కనే ఉన్న ఓ ఇంట్లోని బాత్రూమ్కు వెళ్లింది. అదే సమయంలో ఆమె బాత్రూమ్లో శిశువును ప్రసవించింది. అనంతరం ఆ శిశువును బాత్రూమ్లో వదిలేసి.. తీవ్ర రక్తస్త్రావంతో బయటకు వచ్చింది. ఇది గమనించిన ఇంటి యజమాని వైద్యుడికి సమాచారం అందజేయగా.. ఆయన అక్కడికి వచ్చి చూశారు. అప్పటికే పసికందు మృతి చెందింది. దీంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందజేయగా, ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ పరారీలో ఉన్నాడు. తీవ్ర రక్తస్త్రావం తో బాధపడుతున్న అవివాహితను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.