పదవ తరగతి విద్యార్థి అత్మహత్య

11 Feb, 2020 13:28 IST|Sakshi
మృతి చెందిన నరసింహరెడ్డి

వైఎస్‌ఆర్‌ జిల్లా, పెండ్లిమర్రి: మండలంలోని మాచునూరు గ్రామ పంచాయితీలోని అరవేటిపల్లె గ్రామానికి అరవేటి నరసింహరెడ్డి(15) అనే విద్యార్థి సోమవారం అత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు... నరసింహరెడ్డి వెల్లటూరులోని 10వ తరగతి చదువుతుండేవాడు. తరచూ తలనొప్పి ఉండడంతో, ఒక వైపు పదవ తరగతి పరీక్షలు దగ్గర పడడంతో చదవాలంటే కష్టాంగా ఉందని చెబుతుండేవాడు. సోమవారం ఉదయం ఇంటి సమీపంలో ఉన్న సంపద సృష్టి కేంద్రం(డంపింగ్‌ యార్డు)లో తాడుతో మెడకు ఊరి వేసుకొని చనిపోయాడస. స్థానికులు, కుటుంబ సభ్యులు గమనించే సరికే ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని పోస్టుమాస్ట నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. మృతునికి తల్లి, చెల్లెలు ఉన్నారు. తండ్రి బాస్కర్‌రెడ్డి అనార్యోగకారణంగా తొమ్మిది సంవత్సరాల క్రితం చనిపోయాడు. కుమారుడు మృతి చెందడంతో ఆకుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు