తుపాకీ గురిపెట్టి బ్యాంక్‌లో చోరీ

10 Dec, 2017 02:04 IST|Sakshi

సినీ ఫక్కీలో రూ.13 లక్షల నగదు, నగలు దోపిడీ

తిరువొత్తియూరు (తమిళనాడు): తమిళనాడులోని కోయం బత్తూరులో సినిమా తరహాలో బ్యాంక్‌లో తుపాకులతో చొరబడి ఉద్యోగులను బందీచేసి రూ.13 లక్షల నగదు, నగలను దోపిడీ చేసిన సంఘటన సంచలనం కలిగించింది. కోయంబత్తూరు మపుసానగర్‌లో ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌లో శుక్రవారం సాయంత్రం బ్యాంకు ఉద్యోగులు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయంలో ఐదుగురు దుండగులు తుపాకులు, కత్తులతో లోపలికి చొరబడి గాలిలోకి కాల్పులు జరిపారు.

అనంతరం దుండగులు మేనేజర్, క్యాషియర్లను, ఇతర సిబ్బందులకు తుపాకులు, కత్తులు గురిపెట్టి బందీ చేసి రూ.13 లక్షల నగదును, బ్యాంక్‌కి వచ్చిన కస్టమర్ల వద్ద నగలను దోచుకుని పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో జాగ్రత్తపడిన అక్కడున్నవారు పారిపోతున్న వారిలో ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించగా మరో ముగ్గురు నగదుతో పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు