కరాచీ బేకరీలో చోరీ

29 Apr, 2020 14:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : ఎంజే మార్కెట్ చౌరస్తాలోని కరాచీ బేకరీలో చోరీ జరిగింది. షాప్ వెనుక ఉన్న షెటర్ తొలిగించి రూ. 10 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు కరాచీ బేకరీ యాజమాన్యం బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు