జగిత్యాలలో మూడిళ్లలో చోరీ

30 Jan, 2018 12:19 IST|Sakshi

ఓ ఇంట్లో 4 తులాల బంగారం, వెండి, రూ.20 వేల నగదు అపహరణ

సాక్షి, జగిత్యాల: జిల్లాలో దొంగతనాలు ఆగడంలేదు. సోమవారం రాత్రి కూడా జగిత్యాల పట్టణంలోని అరవింద్ నగర్‌లో వరుసగా మూడిళ్లలో చోరీలు జరిగాయి. తలుపులకు వేసిన తాళాలను దొంగలు పగులగొట్టి ఓ ఇంట్లో రూ.20 వేల నగదు, 2 తులాల బంగారం, 2 తులాల వెండి దోచుకెళ్లారు. మరో రెండిళ్లలోని వారు అందుబాటులో లేకపోవడంతో సొత్తు ఎంత పోయిందో తెలియరాలేదు. దీని పై పోలీసులు క్లూస్‌ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు