చోరీ చేస్తూ పట్టుబడిన దొంగ

17 Jul, 2020 13:03 IST|Sakshi
దొంగని పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్న పీసీ

గుండాల : చోరీ చేస్తుండగా దొంగను పట్టుకొని పోలీసులకు అప్పజెప్పిన సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మోత్కూరు పట్టణానికి చెందిన పల్లపు ఉపేందర్‌ గ్రామంలోని తాటిచెట్టు మల్లిఖార్జున్‌ ఇంట్లోకి చొరబడి సెల్‌ఫోన్‌ చోరీ చేసి అనంతరం కిరాణం షాపులో డబ్బులు తీస్తుండగా శబ్దం అయింది. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు ఉపేందర్‌ని పట్టుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. 

>
మరిన్ని వార్తలు