సాక్షి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 11 తులాల బంగారం, 77 గ్రాముల వెండి, రూ. 22 వేల నగదు, ఒక బైక్, సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ జిల్లాల్లో దొంగతనాలు చేస్తున్నఈ ముఠాపై 10 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.