డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు ఇంట్లో చోరి యత్నం

7 Dec, 2019 10:43 IST|Sakshi

సాక్షి, సికింద్రాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు నివాసంలో దొంగలు పడిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తులు పద్మారావు ఇంట్లోకి దూరి చోరీకి యత్నించారు. అయితే  సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై వారిని పట్టుకున్నారు. అనంతరం ఆ ఐదుగురు దొంగలను పోలీసులకు అప్పగించింది.  కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఐదుగురిలో స్థానికులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు