40 తులాల బంగారం, 20 తులాల వెండి చోరీ
జగిత్యాల: జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం చల్గల్లో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసిన నాలుగిళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. మొత్తం 40 తులాల బంగారం, 20తులాల వెండి, రూ.50 వేల నగదు దొంగిలించుకెళ్లారు. ఈమేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.