ట్రిపుల్‌ ఐటీలో దొంగల హల్‌చల్‌

26 Dec, 2017 12:11 IST|Sakshi

వైఎస్సార్‌ జిల్లా : వేంపల్లి మండలం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో దొంగలు హల్‌చల్‌ చేశారు. ఎస్‌బీఐ బ్రాంచ్‌ ఏటీఎంను ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. నగదు రాకపోవడంతో సీసీ కెమెరా, పుటేజీ సహా రెండు కంప్యూటర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఏటీఎం వెనుక వైపు నుంచి దొంగలు చొరబడినట్లు గుర్తించారు. బ్యాంకు అధికారులు మంగళవారం గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు