సాక్షి, వికారాబాద్ : జిల్లాలోని యాలాల మండలం తిమ్మాయిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఆ గ్రామ సర్పంచ్ అపర్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అపర్ణ బుధవారం అర్థరాత్రి పురుగుల ముందు సేవించారు. దీనికి గమనించిన చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే ఆమె మృతిచెందారు. కాగా సర్పంచ్ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. అపర్ణ మృతిపట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.