సాక్షి, క్రైమ్ : మామిడిచెట్లకు నీరు పోయడానికి వెళ్లిన కుటుంబ సభ్యులు అనుమానాస్పదంగా మృత్యువాత పడిన ఘటన చిత్తూరు జిల్లాలోని చిన్నకాంపల్లిలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఉపాధిహామి కోసం తవ్విన గుంతలో పడి మృతి చెందారు. తల్లిదండ్రులైన సిద్దయ్య, రమాదేవిలకు ఆసరాగా ఉండేందుకు వారి కుమారుడు నరేష్ కూడా మొక్కలకు నీరు పోయడానికి ఉదయం ఆరుగంటలకే వెళ్లారు. అయితే సాయంత్రం ఆరుగంటలకు కూడా ఇంటికి తిరిగిరాకపోవడంతో ఇంటి చుట్టుపక్కలవారు వెదకడానికి వెళ్లారు. అయితే ఉపాధిహామి పథకంలో భాగంతా తీసిన గుంతల వద్ద వారి బిందెలు కనిపించాయి. విషయం ఏంటని చూసేసరికి లోపల వారి శవాలు కనిపించాయి. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. వారి మృతికి మాత్రం ఇంకా కారణాలు తెలిసిరాలేదు.