గ్రానైట్‌ లారీ బోల్తా, ముగ్గురు మృతి

22 Nov, 2019 20:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. గ్రానైట్‌ రాళ్ల లోడ్‌తో వెళుతున్న లారీ బ్రేక్‌ ఫెయిలై డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గ్రానైట్‌ రాళ్లు మీదపడి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. ఇందుకు సంబందించి పూర్తివ వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు