ఆటోను ఢీకొట్టిన బస్సు.. ముగ్గురు మృతి

1 Mar, 2018 07:48 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: జిల్లాలోని యాదమర్రి మండలం మొర్ధనపల్లి వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలివి.. కర్ణాటక ఆర్‌టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడిక్కడే ముగ్గురు చనిపోగా, మరో ఆరుగురికి గాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు