సాక్షి, సిద్దిపేట : ప్రమాదవశాత్తూ నీటిలో సంపులో పడిన ఓ చిన్నారి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన జిల్లాలోని జగదేవ్పూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని నబీనగర్లో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. చిగుళ్ల దామోదర్ కుమారుడు కార్తీక్ (2) ఇంటి సమీపంలో ఉన్న నీటి సంపులో పడి మృతి చెందాడు. ముక్కుపచ్చలారని చిన్నారి మరణంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.