ట్రాక్టర్‌ బోల్తా..డ్రైవర్‌ మృతి

4 Sep, 2018 11:16 IST|Sakshi
ట్రాక్టర్‌ కింద పడి చనిపోయిన సాయిలు

వెల్గటూరు: జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రం కంకరక్రేషర్లలో విషాదం చోటుచేసుకుంది. ఓ ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతిచెందాడు. మృతుడు స్థానికంగా నివాసముంటున్న దండుగుల సాయిలుగా గుర్తించారు. సాయిలు మృతితో సంఘటనా స్థలంలో బంధువుల రోదనలు మిన్నంటాయి.
 

మరిన్ని వార్తలు