చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

9 May, 2020 16:05 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని గుండ్లగుట్టపల్లి వద్ద ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. వీరంతా తమిళనాడు నుంచి తెలంగాణకు కాంట్రాక్ట్‌ పనుల నిమిత్తం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పాకల ఎస్‌ఐ రాజశేఖర్‌, ట్రైనీ డీఎస్పీ యశ్వంత్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు