భార్య కోసం సీటు అడిగినందుకు..

14 Feb, 2020 10:36 IST|Sakshi

ముంబై : రైలులో సీటు కోసం జరిగిన చిన్న వివాదంలో 26 ఏళ్ల యువకుడిని ఆరుగురు మహిళలు సహా 12 మంది కలిసి చితకబాదడంతో అతడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ముంబై-లాతూర్‌-బీదర్‌ ఎక్స్‌ప్రెస్‌లో గురువారం వెలుగుచూసింది.  ముంబైలోని కళ్యాణ్‌కు చెందిన సాగర్‌ మర్కంద్‌ తన భార్య, రెండేళ్ల చిన్నారితో కలిసి కళ్యాణ్‌లో రైలు ఎక్కాడు. జనరల్‌ బోగీలో రద్దీ ఎక్కువగా ఉండటంతో తన భార్య కూర్చున్నేందుకు సీటు సర్దుబాటు చేసుకోవాలని కూర్చున్న మహిళను కోరాడు. ఇందుకు నిరాకరించిన మహిళ సాగర్‌తో వాగ్వాదానికి దిగింది.

క్రమంగా అది ఘర్షణకు దారితీయడంతో మహిళతో ఉన్న 12 మంది అతడిని తోసివేస్తూ దారుణంగా కొట్టారు. బాధితుడి భార్య వారిస్తున్నా వినకుండా వారు గంటపాటు అతడిని చితకబాదారు. పుణే నుంచి దౌండ్‌ స్టేషన్‌ వరకూ బాధితుడిపై వారి దాడి కొనసాగింది. దౌండ్‌ స్టేషన్‌లో రైల్వే పోలీసులు సాగర్‌ను ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. సాగర్‌ కుటుంబం షోలాపూర్‌ జిల్లాలో బంధువు అంత్యక్రియలకు హాజరైన క్రమంలో ఈ విషాద ఘటన చోటుచేసకుంది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.

చదవండి : రైల్లో మత్తు మందు ఇచ్చి..

మరిన్ని వార్తలు