విజయవాడలో ట్రావెల్స్‌ బస్సు బీభత్సం

7 Mar, 2020 11:55 IST|Sakshi

సాక్షి, విజయవాడ: నగరంలోని బందరు రోడ్డులో శనివారం ఓ ప్రైవేట్‌ ట్రావెల్ బస్సు బీభత్సం సృష్టించింది. రంగా విగ్రహం ఎదురుగా ఉన్న డివైడర్‌ను బస్సు అతివేగంగా ఢీకొట్టి నిలిచిపోయింది. బస్సులో నలుగురే ప్రయాణికులు ఉండటంతో ముప్పు తప్పింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో గాయపడిన బస్సు డ్రైవర్‌ను స్థానికులు సమీపంలో ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు