ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బస్సు.. ఒకరి మృతి

26 Apr, 2019 06:34 IST|Sakshi

సాక్షి, నల్గొండ : నకిరేకల్‌ శివారులో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ (ఆరెంజ్‌ ట్రావెల్స్‌) బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. నకిరేకల్‌ మండలంలోని కడపర్తి గ్రామానికి చెందిన వీరు.. చెరువు అన్నారం వైపు ట్రాక్టర్‌పై గడ్డి కోసం వెళ్లారు. అదేసమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేట్‌ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌లో ఉన్న ఐదుగురిలో ఒకరు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో ప్రయాణిస్తున్న వారు మరో బస్సెక్కి హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ ఘటనపై కట్టంగూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు