అలిపిరి వద్ద మద్యం, మాంసం స్వాధీనం

14 May, 2020 11:06 IST|Sakshi

తిరుమల: అలిపిరి టోల్‌గేట్‌ వద్ద బుధవారం మద్యం, మాంసం స్వాధీనం చేసుకున్నట్లు టీటీడీ వీఎస్‌ఓ ప్రభాకర్‌ తెలిపారు. తిరుపతికి చెందిన ఒక టీవీ చానల్‌ వీడియో జర్నలిస్టు కారులో తిరుపతి నుంచి తిరుమలకు వెళుతుండగా అలిపిరి టోల్‌గేట్‌ వద్ద భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. 5 కిలోల చికెన్, సిగ్నేచర్‌ విస్కీ–4 బాటిళ్లు, ఓట్కా–2 బాటిళ్లు, లూజ్‌ లిక్కర్‌–2000 ఎంఎల్‌ ఉన్నాయి. నిందితుడిని తిరుమలలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. అతనిపై గతంలో నమోదైన ఒక కేసు విచారణలో ఉంది. 

మరిన్ని వార్తలు