రామనగర తాలూకాలో విషాదం
పిల్లలను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన నవ దంపతులు
వీరు శేఖర్– సుమిత్ర. పెళ్లయి మూడునెలలు కూడా కాలేదు. ఆదివారం రామనగర తాలూకాలో చెరువు ప్రమాదంలో విగతజీవులయ్యారు.
దొడ్డబళ్లాపురం : చెరువులో మునిగి నలుగురు మృతి చెందిన దారుణ సంఘటన రామనగర తాలూకా చిక్కేనహళ్లిలో చోటుచేసుకుంది. వివరాలు... చిక్కేనహళ్లిలోని రాజు ఇంటికి చుట్టపు చూపుగా చెన్నపట్టణ పరిధిలోని హనుమంతనగరకు చెందిన శేఖర్ (35), సుమిత్ర (28) దంపతులు వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం శేఖర్ దంపతులు రాజు కుమారుడు ధనుష్ (6), కుమార్తె హంస (7)ను తీసుకుని సమీపంలోని నాగప్ప దేవాలయం వద్ద ఉన్న చెరువు వద్దకు వెళ్లారు. పిల్లలు నీటిలో ఆడుతూ మునిగిపోతుండటంతో వారిని కాపాడే ప్రయత్నంలో శేఖర్, సుమిత్ర కూడా నీటిలో మునిగి మృతి చెందారు. రామనగర గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లయిన మూడు నెలలకే : శేఖర్, సుమిత్ర దంపతులకు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. చుట్టుపు చూపగా వచ్చి ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.