సాక్షి, గుంటూరు : జిల్లాలోని తెనాలిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఈ సంఘటన తెనాలి ఐతానగర్లో సోమవారం చోటుచేసుకుంది. ఐతానగర్కు చెందిన రాజేష్(12), పండు(12) అనే ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారు. ఇద్దరికీ ఈత రాకపోవటంతో నీళ్లలో మునిగి చనిపోయారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు కళ్లముందు తిరుగాడిన పిల్లలు విగతజీవులుగా మారటంతో కన్నవారు కన్నీరుమున్నీరుగా విలపించారు.