కారు బోల్తా, ఇంజనీరింగ్‌ విద్యార్థులు మృతి

11 Nov, 2019 21:09 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట: కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్‌ వద్ద సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ గురునానక్‌ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు గుంటూరు జిల్లా బాపట్ల వెళ్లి తిరిగి వస్తుండగా దుర్ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులు ఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. కాగా, మృతులను రేవంత్‌(చంపాపేట్‌, హైదరాబాద్‌), హర్ష(బాలాపూర్‌, హైదరాబాద్‌), శశాంక్‌లుగా గుర్తించారు. వీరిలో రేవంత్‌, హర్ష ఘటన స్థలంలో మృతిచెందగా, శశాంక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

మరిన్ని వార్తలు