రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి

18 May, 2020 23:37 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: కొమురవెల్లి మండలం దానంపల్లి గ్రామ శివారులో ఎదురెదురుగా వెళ్తున్న రెండు బైకులు పరస్పరం ఢీ కొనడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలయ్యారు. ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతులను దానంపల్లి గ్రామానికి చెందిన బండి శేఖర్, చిట్యాల గ్రామానికి చెందిన గొర్లకాడి స్వామిగా గుర్తించారు. స్వామితోపాటు బైక్‌ ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరిన్ని వార్తలు