అంబర్‌పేటలో విషాదం

26 May, 2018 15:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని అంబర్‌పేట్‌, ప్రేమనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణ పనుల్లో ప్రమాదవశాతతూ గోడ కూలి ఇద్దరు మృతి చెందారు. మరొకరికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అనుమతులు లేకుండా ఓ కంపెనీ నిర్మాణాలు చేపడుతున్నట్లుగా ఈ ఘటన చోసుకుంది.

ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భవన యజమాని పరారీలో ఉండగా  గాలింపు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

మరిన్ని వార్తలు