కారు, లారీ ఢీకొని ఇద్దరు మృతి

18 Feb, 2019 10:21 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం మేనూర్ శివారులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 161 పై కారు, లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హైదరాబాద్‌లోని ఆసుపత్రకి తరలించారు. మృతులు గచ్చిబౌలి వాసులుగా గుర్తించారు. షిర్డీ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు