విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి

26 Jan, 2018 17:22 IST|Sakshi

సాక్షి, దౌల్తాబాద్: వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని చిన్న గుంట తాండాలో తమ పొలంలో బోరు మోటర్ బిగిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు రైతులు మృతిచెందారు. వారిని వాల్యా నాయక్ (42), శ్రీశైలం(22)గా గుర్తించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని కోస్గి ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు