సాక్షి, మేడ్చల్ : వాహనం రన్నింగ్లో ఉండగా టైర్ పగిలిన ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన గురువారం మేడ్చల్ జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్రోడ్డుపై వెళుతున్న మహేంద్ర మ్యాక్సీ ట్రక్ వాహనం టైర్ పగలటంతో వేగంగా డివైడర్ను ఢీకొంది. దీంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన జరిగినపుడు వాహనంలో మొత్తం 11మంది కూలీలు ఉన్నారు. ప్రమాదంలో మరణించిన మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.