ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి యువతిపై..

19 Jan, 2020 22:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలికి నిందితులు రైలులో పరిచయం అయ్యారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. నగరానికి రప్పించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గోపాలపురం పోలీసులు.. నిందితులను అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు