ఖరీదైన బైక్‌తో పరారీ

26 Apr, 2019 08:25 IST|Sakshi

బొమ్మనహళ్లి : మీ బైక్‌ చాలా బాగుంది, ఒక ఫొటో తీసుకుంటా మంటూ ఇద్దరు యువకులు బైక్‌ యజమానితో మాట్లాడినట్లు నటిస్తూ ఆపై దాడి చేసి రూ. 27 లక్షల విలువైన బైక్‌తో ఉడాయించిన ఘటన కోరమంగళలో చోటుచేసుకుంది. కోరమంగళకు చెందిన బైక్‌ యజమాని గణేశ్‌ గౌడకు రూ. 27 లక్షల విలువైన హోండా గోల్డ్‌ వింగ్‌ బైక్‌ ఉంది. గురువారం గణేశ్‌ బైక్‌పై పనిమీద బయటకు వచ్చాడు.

ఇంతలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌లో వచ్చి మీ బైక్‌ చాలా బాగుంది, ఒక ఫోటో తీసుకుంటామంటూ నటిస్తూ ఒక్కసారిగా గణేశ్‌పై దాడి చేసి బైక్‌ను తీసుకుని పరారయ్యారు. ఈ హఠాత్‌ పరిణామానికి గురైన గణేశ్‌ హుటాహుటిన కోరమంగళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు